45 రోజుల్లో ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఎంతమంది మహిళలు ప్రయాణించారంటే….!

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు.

 

ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి అని ఆయన అన్నారు.ఉచిత బస్ ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం అని వెల్లడించారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు .ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.అంధులకు అనౌన్స్మెంట్ ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తాం” అని ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news