ఒక్క రోజే 52 వేల కేసులు… అమెరికా తర్వాత భారత్…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలో లక్షల దిశగా వెళ్తున్నాయి కరోనా కేసులు. నేడు ఏకంగా ఒక్క రోజే 52 వేల కరోనా కేసులు వచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో భారతదేశంలో 52,123 పాజిటివ్ కేసులు & 775 మరణాలు నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

coronavirus

మొత్తం కరోనా కేసులు దేశ వ్యాప్తంగా చూస్తే… 15,83,792 వద్ద ఉన్నాయి, వీటిలో 5,28,242 క్రియాశీల కేసులు ఉన్నాయి. 10,20,582 మంది దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 34,968 మంది దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పరిక్షలు ఒక కోటీ 81 లక్షలు చేయగా నిన్న ఒక్క రోజే 4 లక్షల 46 వేల పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version