MLA Prem Sagar: అయోధ్య రాముడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం మొదలు పెట్టింది..

-

అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసములో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ తీరును విమర్శించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని,శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులకు, శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ ముందు అక్షింతలను పంచడం విడ్డురంగా ఉందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోఅనేక హిందు దేవాలయాలు, శ్రీరాముని ఆలయాల నిర్మాణం జరిగాయని ఆయన విశదీకరించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు దేవుని పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందాలనే ఆలోచనకు స్వస్తి పలకాలని అన్నారు. సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనీ అనుకున్న కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడి ఓటమి చెంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news