చిరుత దాడిలో ప్రాణాలొదిలిన లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

-

తిరుమలకు నడకదారిని రోజుకి లక్షల సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. కానీ దాదాపుగా ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ రోజు ఉదయం కాలినడక వెళుతున్న పాప లక్షిత పై చిరుత దాడి చేసిన ఘటనలో ఆ చిన్నారి మృతించెందింది. ఈ పాప నెల్లూరు జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది. కొత్తగా టీటీడీ చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి పాప మరణించిన ప్రదేశానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఈయన మాట్లాడుతూ చనిపోయిన లక్షిత కుటుంబానికి టీటీడీ తరపున రూ. 5 లక్షలు మరియు అటవీశాఖ నుండి మరో రూ. 5 లక్షలు మొత్తం 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా అందించనున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి భరోసాను కల్పించారు.

ఇక ఈ ప్రమాదం ఎలా జరిగినదన్న విషయం విజిలెన్సు, పోలీస్ మరియు అటవీ శాఖ అధికారులను అడిగారు భూమన.

Read more RELATED
Recommended to you

Latest news