65 మంది సింగర్స్.. 5 భాషలు. ఒకే పాట

-

భారత స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. బానిస సంకెళ్లు తెంచుకున్న భారత్‌ సగర్వంగా నిలబడిన ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకోవాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, దేశభక్తికి ఏ నిబంధనలు వర్తించవు. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు మన సినీ గాయకులు.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా’. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ పాటను 5 భాషల్లో 65మంది గాయనీగాయకులు ఆలపించారు.

song
song

‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. “టుగెదర్‌ యాజ్‌ వన్‌’ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం’ అని ట్వీట్‌ చేశారు.తెలుగులో ఈ పాటకు రాజశ్రీ సాహిత్యం అందించగా, తమిళంలో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, మలయాళంలో గోపాలకృష్ణన్‌లు రచించారు. 65మంది సింగర్స్‌ తమ ఇళ్లలోనే ఉండి పాడిన వీడియోలను ఒక్కటిగా కూర్చి ఈ పాటను తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news