దారుణ ఘటన : హాస్పిటల్ కి వెళ్తూ ఏడుగురు మృతి !

-

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు. వీరంతా సదరు గర్భిణీ ను ఆస్పత్రిలో చూపించ డానికి వెళ్తున్నట్టు సమాచారం.

మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. కాగా వీరందరూ అలండ్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి, ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. తెలుస్తున్న సమాచారం మేరకు.. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వీరంతా కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కలబురగి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news