నిమ్మకాయ మింగి చిన్నారి మృతి…!

-

చిన్నారుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నారులు ఈ మధ్యకాలంలో తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా ప్రాణాన్ని కూడా కోల్పోతున్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. ఇది చాలా భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిమ్మకాయ మింగి ఒక చిన్న పిల్ల ప్రాణాలను కోల్పోయింది.

dead body
dead body

అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామానికి చెందింది సకీదీప, గోవిందరాజు దంపతులకి ఏడేళ్ళకి ఓ పాప పుట్టింది. ఆ చిన్నారి జశ్విత (9నెలలు) ఇంట్లో ఆడుకుంటోంది. పొరపాటున ఆ చిన్నారి నిమ్మకాయను మింగింది. గమనించిన తల్లి ఆస్పత్రికి వెంటనే తీసికెళ్ళింది. కానీ అప్పటికే చిన్నారి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news