ప్రియురాలిని చంపి ఇంట్లో పాతిపెట్టిన ప్రియుడు.. ఆ విషయం బయటపడొద్దనే!

-

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిరోజాబాద్‌కు చెందిన గౌరవ్‌సింగ్ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించాడు. పదహారేళ్ల బాలికతో తనకున్న సంబంధం ఎక్కడ బయటపడుతుందనే భయంతో ఆమెను తన ఇంట్లోనే చంపి గదిలో పూడ్చిపెట్టాడు. కుటుంబసభ్యుల సాయంతో ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ సింగ్ అప్పటి నుంచి తన కుటుంబసభ్యులతో తప్పించుకుంటూ తిరుగుతున్నాడు.

బాలిక-హత్య
బాలిక-హత్య

ఎట్టకేలకు గౌరవ్ సింగ్, అతని కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బాలికను హత్య చేసినట్లు గౌరవ్ సింగ్ అంగీకరించాడు. తన ఇంట్లోనే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు తవ్వకాలు నిర్వహించి, బాలిక అస్తిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గౌరవ్ సింగ్ బాలికను మోటార్ సైకిల్ నేర్పిస్తాననే నెపంతో దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను చంపినట్లు గౌరవ్‌సింగ్ పోలీసులకు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news