మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో అధికారులపై కేసు నమోదు

-

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా ఒకరి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని నాగావర ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కళ్యాణ్ నగర్ నుంచి హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ కి వెళ్లే రోడ్డులో ఉన్న మెట్రో మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు, వారి రెండున్నర ఏళ్ల పిల్లాడు గాయాల పాలయ్యారు.

వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 25 ఏళ్ల తేజస్వి, ఆమె కుమారుడు విహాన్ మరణించారు. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో బెంగుళూరు పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిర్మాణ సంస్థ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అధికారులతో పాటు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై సీరియస్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news