తన భార్యకు రెండో వివాహం చేయాలంటూ తండ్రికి సూసైడ్ నోట్..

-

`నాన్నా.. అప్పులు వసూలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి.. నా భార్యకు రెండో వివాహం చేయండి..` అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. , ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్‌ కుమార్‌, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ గా పనిచేస్తున్నాడు. 2019లో ఇతనికి సూర్యాపేటకు చెందిన హరిత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రవణ్ కుమార్ కు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను, పురుగుల మందు తాగగా, దీన్ని గమనించిన హారతి, అతడిని ఆసుపత్రికి తరలించింది.

Young sad man sitting in the dark room.

శ్రవణ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రవణ్‌ ఓ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో గతంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవాలని, అందుకు తన స్నేహితులు సహకరించాలని ఈ లేఖలో శ్రవణ్ కోరాడు. తనకు ఎండో డబ్బులు రావాల్సి వున్నాయని, వాటితో అంత్యక్రియలు చేయాలని, తన భార్యకు రెండో వివాహం చేయాలని కోరాడు. ప్ర‌స్తుతం ఈ కేసును పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news