యూపీలో దారుణం.. మేక పొలంలోకి వచ్చిందని 60 ఏళ్ల దళిత మహిళను తీవ్రంగా కొట్టిన వ్యక్తి..!

-

ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మేక తన పొలంలోకి వచ్చిందని ఒక వ్యక్తి, దళిత మహిళను దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాలోకి వెళితే, బులందహర్లో 60 సంవత్సరాల వయసు కలిగిన దళిత మహిళకు చెందిన మేక పొరపాటున ఒక వ్యక్తి పొలం లోకి వెళింది. దీంతో ఆ పొలం యజమాని వయసు పైబడిన మహిళ అని చూడకుండా కులం పేరుతో తిడుతూ నిస్సహాయంగా ఉన్న దళిత మహిళపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ ఘటన పోలీసుల వరకు చేరడంతో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. భారత్ లో దళితులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింసను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇంతకుముందు ఫిబ్రవరిలో, గుజరాత్ లోని గాంధీనగర్ లో తన వివాహ ఊరేగింపులో భాగంగా గుర్రంపై స్వారీ చేసినందుకు దళిత పెళ్ళికొడుకుపై దాడి జరిగింది. గుర్రపు స్వారీ చేస్తూ ఊరేగింపుగా వధువు ఇంటికి వెళుతుండగా బైక్ పై వచ్చిన వ్యక్తి అతడినీ అడ్డుకుని గుర్రం నుంచి క్రిందికి లాగి చెంప దెబ్బ కొట్టి, తన వర్గానికి చెందిన వారు మాత్రమే గుర్రపు స్వారీ చేయాలన్నాడు. అలాగే ఆ వరుడిని కులం పేరుతో దూషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news