విషాదం.. గొంతులో చేప ఇరుక్కుని వ్యక్తి మృతి

-

ఇటీవలే స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కు పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లోని జాంజ్ గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్ (14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సగం చేపను మాత్రమే బయటికీ తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటికీ తీశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా గొంతులో పచ్చి చేప ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక మరణించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్ (45) మోతిఘనపూర్ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. ఓ చేపను తినేందుకు ప్రయత్నించగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. స్నేహితులు ఆ చేపను అతని నోట్లో నుంచి తీసేలోపే ఊపిరి ఆడక ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన చాలా విషాదం అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news