డిగ్రీ విద్యార్థులకు శుభవార్త అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త కోర్సు BSC బయో మెడికల్ సైన్స్ చేరబోతోంది. నాలుగేళ్ల ఆనర్స్ కోర్స్ తర్వాత డైరెక్ట్ గా PHD లో చేరవచ్చు. ఈ కోర్స్ చివరి ఏడాది పూర్తిగా ఫార్మా కంపెనీలలో ఇంటర్న్ షిప్ చేయవలసి ఉంటుంది. ఇదే కోర్సును మూడేళ్లలోనూ పూర్తి చేయవచ్చు.

కానీ దీనిని కూడా డిగ్రీగానే పరిగణిస్తారు. ఈ కోర్సుతో ఫార్మా రంగంలో 100% ఉద్యోగాలు సాధించవచ్చు అని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో విద్యార్థులు సంతోషపడుతున్నారు. కాగా ఈ కోర్స్ చేసినట్లయితే తొందరగా ఉద్యోగాన్ని పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు మరో రంగంలో ముందడుగు వేయబోతున్నారు. దీంతో తల్లిదండ్రులు సైతం సంతోషపడుతున్నారు.