చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే….కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం చిన్న గుడిపల్లి పంచాయతీ ఎం. కొత్తూరు గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి తన పొలంలో గంజాయి పండిస్తున్నట్లుగా స్థానికులు గుర్తించారు. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి పండిస్తూ విక్రయాలు చేస్తున్నాడు.

దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని దాడులు నిర్వహించారు. అక్కడ పెరుగుతున్న గంజాయి మొక్కలను నాశనం చేసి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సైతం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఏపీ రాష్ట్రంలో మరెవరు గంజాయి సాగు చేయకూడదని అధికారులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా గంజాయి సాగు చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.