టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్షదీప్ సింగ్ కు అరుదైన అవార్డు !

-

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్షదీప్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా స్టార్ పెసర్ అర్షదీప్ సింగ్ ఐసిసి ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్ చేసింది.

ఈ జాబితాలో అర్షదీప్ సింగ్ తో పాటు సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సేన్, ఆఫ్గానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్ధన్, న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ లు నామినేట్ అయ్యారు. టీమిండియా కు ఈ ఏడాది టీ20 లో లభించిన ఆణిముత్యం అర్షదీప్ సింగ్. ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ లో జస్ప్రీత్ బూమ్రా లేని లోటును తీరుస్తూ ఆర్షదీప్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version