భారత అమ్ములపొదిలో చేరిన భీకర యుద్ధ విమానం రఫేల్ కళాకృతిని రూపొందించారు ప్రసిద్ధ సైకతశిల్పి అశోక్ కుమార్. సరయూ నది ఒడ్డున సృష్టించిన ఈ శిల్పంపై ‘రఫేల్ భారత్కు కాపలాదారు’ అనే సందేశాన్ని ఇచ్చారు. బిహార్ సారణ్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ సైకత శిల్పి అశోక్ కుమార్.. సరయూ నది ఒడ్డున రఫేల్ యుద్ధ విమానాల ఆకారాన్ని రూపొందించారు. ‘రఫేల్ భారతదేశానికి కాపలాదారు’ అనే సందేశాన్ని దానిపై రాశారు అశోక్. రఫేల్ రాకతో జాతీయ భద్రతలో 100 అడుగులు ముందుకు వేశామని అభిప్రాయపడ్డారు.

అశోక్ రూపొందించిన ఈ కళాకృతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భీకర యుద్ధ విమానం రఫేల్ భారత వైమానిక దళంలో చేరడం దేశానికి గర్వకారణమని అశోక్ కుమార్ అన్నారు. అశోక్ కుమార్ గతంలోనూ ఇలాంటి సందేశాత్మక సైకత శిల్పాలను రూపొందించారు. లాక్డౌన్లో చాలా మందికి సాయమందించిన బాలీవుడ్ నటుడు సోనుసూద్ కళాకృతిని కూడా ప్రదర్శించారు.