గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ కు షాక్

-

 

గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదనతో పార్టీ మారుతున్నానని ప్రకటించారు.ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news