ప్రపంచాన్ని భయపెడుతున్న ట్వీట్…! ట్రంప్ రేపు ఉదయం ఎం చెప్తారు…?

-

“అంతా బాగానే ఉంది! ఇరాక్‌లోని రెండు సైనిక స్థావరాల మీద ఇరాన్ నుండి క్షిపణులు ప్రయోగించబడ్డాయి. ప్రమాదాలు మరియు నష్టాల అంచనా ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటివరకు, చాలా బాగుంది! మనకు చాలా ఉన్నాయి… ప్రపంచంలో ఎక్కడైనా శక్తివంతమైన మరియు సుసంపన్నమైన మిలటరీ, ఇప్పటివరకు! నేను రేపు ఉదయం ఒక ప్రకటన చేస్తాను.” అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,

చేసిన కీలక ప్రకటన ఇది. రేపు ఉదయం ఆయన ఎం ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తమ సైనిక కమాండర్ ని అమెరికా చంపడంపై ఆగ్రహంగా ఉన్న ఇరాన్ మంగళవారం అమెరికా బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ప్రాణ నష్టం ఎంత అనేది తెలిదు.

అయితే ట్రంప్ రేపు యుద్ధం గురించి ప్రకటన చేస్తారా…? అనేది ఆసక్తిగా మారింది. ఇరాన్ రాజధాని బాగ్దాద్ ని అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరించింది. దీనితో ట్రంప్ ఏదైనా దాడులకు ఆదేశాలు జారీ చేస్తారా…? సైనిక చర్యకు దిగుతారా అనేది చూడాలి. ఆయన ప్రకటన గురించి ప్రపంచం మొత్తం ఆసక్తికంటే ఆందోళనగా ఎదురు చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version