ప్రేమ కోసం.. పురుషుడిగా మారిన మహిళ !

-

ప్రేమ కోసం చాలామంది చాలా త్యాగాలు చేశారు. తమను ప్రేమించిన వారి కోసం ఇలాంటి పనులు చేయడానికైనా సిద్ధ పడుతున్నారు. అయితే.. ప్రేమ పేరుతో ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక మహిళ మరో మహిళను బలవంతంగా పురుషుడిగా మారేలా చేసి ఆపై మోసగించిన ఘటన జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మధురై జిల్లా లోని మీనాక్షి నగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు ప్రాంతానికి చెందిన సెంథిలతో స్నేహం ఏర్పడింది.

ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జయసుధ పురుషుడిగా మారాలని సెంథిల ఒత్తిడి చేసింది. 2021 మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని తన పేరును ఆది శివ గా మార్చుతుంది. ఆలయంలో వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయం ఇద్దరి ఇండ్లలో తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తిరుప్పరకుండ్రం పోలీస్ స్టేషన్లో సెంథిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. దీంతో తనకు తగిన న్యాయం చేయాలని ఆది శివ స్థానిక కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version