జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం : ఆళ్ల నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పవన్ తన వాహనానికి అమ్మవారి పెట్టి, బురద చల్లుతున్నాడని విమర్శించారు. జగన్‌పై ద్వేషంతో విషాన్ని చిమ్ముతున్నాడని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్‌ను వ్యక్తిగతంగా దూషించటానికి, చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే.. పవన్ ఈ వారాహి యాత్ర చేపట్టాడని అభిప్రాయపడ్డారు. పవన్ హద్దుమీరి మాట్లాడుతున్నా.. తాము సంయమనంతో ఉన్నామని, చేతకాక కాదని పేర్కొన్నారు. పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఫైరయ్యారు.

కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీయే గెలుస్తుందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వాహనానికి అమ్మవారి పేరు పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. జగన్ ను తిట్టేందుకు, చంద్రబాబును సీఎం చేసేందుకు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version