ఏసీబీ కేసులో కీసర తహసీల్దార్ మినహా మిగతా అందరికీ బెయిల్

-

మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసిల్దార్ ఇ బి నాగరాజు అవినీతి కేసులో ఇద్దరూ రియల్టర్లు కందాడి అంజిరెడ్డి , శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఏ సాయినాథ్ కు నిన్న ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఏ సాయినాథ్ లకు షరతులతో కూడిన బెయిల్ ని ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ తహసీల్దార్ నాగరాజు మీద ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేయడంతో ఆయనకు బెయిల్ దొరక లేదు.

బెయిల్ లభించిన ముగ్గురు నిందితులూ ఈరోజు బెయిలు పై విడుదల అయ్యారు. రియల్టర్లు కందాడి అంజిరెడ్డి , శ్రీనాథ్ యాదవ్ ,వీ.ఆర్.ఏ సాయినాథ్ లు నలభై ఐదు రోజులుగా చంచల్గూడ జైలులోనే రిమాండ్ లో ఉన్నారు. ఇక కీసర మండలం రాంపల్లి దయారలో అంజిరెడ్డి విడుదల అయ్యారని తెలియడంతో ఆయన అనుచరులు టపాసులు కాల్చి తమ సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news