ఫైనల్ : ఇండియా VS పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ … మరోసారి పాక్ ను చిత్తు చేస్తుందా ?

-

ఎమర్జింగ్ ఆసియా కప్ పేరుతో ఎనిమిది జట్లు గత రెండు వారాలుగా పోరాడుతున్నాయి. చివరికి అంతిమ సమరానికి రెండు జట్లు చేరుకున్నాయి . నిన్న జరిగిన సెమీఫైనల్ లో పాకిస్తాన్ మరియు ఇండియాలు ఫైనల్ కు అర్హత సాధించాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ రెండు జట్లు లీగ్ దశలో ఒకసారి తలపడగా ఇండియా పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కానీ నిన్న సెమీఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్తాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనను చూపెట్టి సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. కాగా ఇండియా నిన్న బంగ్లాదేశ్ పై బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం 211 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ను పోగొట్టుకునే స్థాయికి వెళ్ళింది. కానీ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి మ్యాచ్ ను ఇండియా వైపుకు తిప్పారు.

ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ? టైటిల్ ను ఎవరు ముద్దాడుతాడు అన్న విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news