షాకింగ్ : డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్టు

-

చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీని ఎన్సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యం లో అతని ఇంట్లో శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదివారం ముంబాయి సిటీ కోర్టు ఎదుట హాజరు పరిచారు.

ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే దీని పై మాట్లాడుతూ.. కోహ్లీ ఇంట్లో స్వల్ప మోతాదులో డ్రగ్స్‌ పట్టుబడడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. అయితే.. అతను వాటికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో ముంబాయి లోని తమ కార్యాలయానికి తరలించామని చెప్పారు. అలాగే డ్రగ్స్‌ వ్యాపారి అజయ్‌ రాజు సింగ్‌ ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గతంలో అర్మాన్‌ పై అతడి ప్రియురాలు నీరు రాంధ్వ కేసు పెట్టింది. తనను శారీరకంగా హింసించాడని కేసు పెట్టింది. ఇక తాజాగా అర్మాన్‌ కోహ్లీ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version