‘జెండా’ ఎగరేస్తాం.. : ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్

-

“మా” అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐదుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. “జెండా ఎగురవేస్తాం” అంటూ ప్రకాష్ రాజు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ హల్చల్ చేస్తోంది. అయితే ప్రకాష్ రాజు ఈ ట్వీట్ దేనిని ఉద్దేశించి చేశారనే దానిపై…. క్లారిటీ మాత్రం రాలేదు. రేపు స్వాతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో చేశారా ? లేక… త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో కచ్చితంగా జెండా ఎగర వేస్తామనే ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. కాగా వారం క్రితం ప్రకాష్ రాజ్.. కు షూటింగ్ లో గాయం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news