సీక్వెల్ తో మరో ప్రయోగాని సిద్దమవుతున్న అడవిశేష్ ..!

-

అడవి శేష్ … టాలీవుడ్ లో చిరంజీవి, రవితేజ, నాని లాగా సొంతగా ఎదిగిన హీరో. కమర్షియల్ అంశాలని, మాస్ ఇమేజ్ అని ఒక ధోరణి లోనే కాకుండా ప్రతీ సినిమాకి తన సొంత ఆలోచన తో చాలా నమ్మకంగా సినిమా చేస్తూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు అడవి శేష్ నటించిన సినిమాలేవి దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టలేదు. నిర్మాతకి పెట్టిన డబ్బు పెట్టినట్టు వచ్చి చేరింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేఫ్. అంటే అడవి శేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

అంతేకాదు ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉందన్న మాట ఇండస్ట్రీలో అందరు ఒప్పుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే క్రియేటివ్ థాట్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడం లో అడవి శేష్ చాలా కొత్తగా హాలీవుడ్ స్టైల్లో ఆలోచిస్తాడన్న ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అందుకు ఉదాహరణ తను నటించిన ‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ సినిమాలే. అందుకే అడవి శేష్ కి సపోర్ట్ గా పి.వి.పి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఉంది.

ఇక అడవి శేష్ ‘గూఢచారి’ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తానని ఇంతకముందే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘గూఢచారి 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో హై టెక్నికల్ వ్యాల్యూస్ తో వచ్చిన ‘గూఢచారి’ 2018లో రిలీజై సక్సస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు ప్రకాష్ రాజ్ సుప్రియ శోభితా దూళిపాళ్ల వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాకే సీక్వెల్ గా రాబోతుంది ‘గూఢచారి 2’.

అడవి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ టైటిల్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై ఘటనలో వీర మరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత ‘గూఢచారి 2’ మొదలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news