భారత్ కు ఏడీబీ మరో రూ.22.45 కోట్ల సాయం..!

-

కరోనా మహమ్మారిపై పోరులో భారత్​కు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తోంది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ). మూడు నెలల క్రితం కొవిడ్​ కట్టడికి రూ. 11,400 కోట్లు (1.5బిలియన్​ డాలర్)ల మేర రుణం మంజూరు చేసిన బ్యాంకు.. తాజా మరో రూ. 22.45 కోట్ల (3 మిలియన్​ డాలర్లు) ఆర్థిక సాయం ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్న వేళ తక్షణ చర్యలైన వ్యాధులపై నిఘా పెంపు, కాంటాక్ట్​ ట్రేసింగ్​, వ్యాధి నిర్ధరణ వంటి వాటి కోసం ఈ రుణం మంజూరు చేసినట్లు తెలిపింది ఏడీబీ. నిరుపేద, ఆర్థికంగా చితికిపోయిన రంగాల ప్రజలకు సామాజిక భద్రత కల్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

asian develpment bank
asian develpment bank

ఏప్రిల్​ 28న కేర్స్​ (యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​) కార్యక్రమంలో భాగంగా కరోనా కట్టడికి భారత్​కు రూ. 11,400 కోట్లు (1.5 బిలియన్​ డాలర్)ల రుణాన్ని మంజూరు చేసింది ఏడీబీ.ఫిలిప్పీన్స్​ రాజధాని మనీలా కేంద్రంగా ఉన్న ఏడీబీ, కోవిడ్​-19 యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​(కేర్స్​) కార్యక్రమం ద్వారా 80 కోట్ల మంది ప్రజలకు నేరుగా సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. వేల కుటుంబాలు, నిరు పేదలు, రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, దివ్యాంగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.20 బిలియన్​ డాలర్లతో కొవిడ్​-19 పాండెమిక్ రెస్పాన్స్ ఆప్షన్​ను(సీపీఆర్​ఓ) కరోనాపై పోరు కోసం ఏప్రిల్​ 13న ఏర్పాటు చేసింది ఏడీబీ. సభ్యదేశాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారానే కేర్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news