హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ.. గుట్టు రట్టు చేసిన ఎస్వోటీ పోలీసులు!

-

నగరంలో కల్తీ పాల దందా మరోసారి గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో గుట్టుగా సాగిస్తున్న కల్తీ పాల దందాను ఎస్వోటీ పోలీసులు బట్టబయలు చేశారు.ఓ ముఠాగా ఏర్పడి రోజూ వేల లీటర్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. కల్తీపాల గ్యాంగ్ గురించి సమాచారం అందడంతో ఎస్వోటీ పోలీసులు పీర్జాదిగూడలో దాడులు జరిపారు.

ఈ దాడిలో గజేందర్ సింగ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అతడు తన గ్యాంగ్‌తో కలిసి ఓ గోడౌన్‌లో గుట్టుగా కల్తీపాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాలపొడిలో ఎసిటిక్ యాసిడ్, లిక్విడ్ గ్లూకోజ్, పామాయిల్ కలిపి కల్తీపాలు తయారు చేస్తూ.. ప్రతి రోజూ 5 వేల లీటర్లకు పైగా పాలను ఎగుమతి చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో గజేందర్‌ సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గోడౌన్‌ను సీజ్ చేసి అందులో ఉన్న టన్నుల కొద్దీ పామాయిల్, మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news