6 ఏళ్లు నిండిన వారికే 1వ తరగతిలో అడ్మిషన్స్..మోడీ సర్కార్‌ ఆదేశాలు

-

 

మోడీ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లల చదువు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది.

Age 6 Should Be The Minimum Age For Class 1 Students Across All States

2024 – 25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ 1/ఒకటో తరగతిలో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఇక తమ ఆదేశాలు పాటించాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news