రన్​వేపై ఉండగా ఎయిర్ ఇండియా విమానం​లో మంటలు

-

ఇటీవల తరచూ విమానాల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రన్ వే పై ఉండగానో.. లేక రన్ వే మీదకు రాగానో ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొన్ని ప్రయాణికులతో ఉండి ఎక్కడ పడితే అక్కడ అకస్మాత్తుగా కూలిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి వస్తున్న విమానం మస్కట్​ విమానాశ్రయం రన్​వే పై ఉండగా ఒక్కసారిగా రెండో ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ.. విమానాన్ని కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని నిలిపేశారు. ఎయిర్​పోర్ట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది.

ప్రయాణికులు కొచిన్​కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version