క్షీణించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలింపు..

-

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిసింది. ఆయన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని సమాచారం. గతంలో ఒకసారి చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన విషయం విదితమే. అయితే ఆ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. అయినప్పటికీ ఆ గాయాల కారణంగానే ఇప్పుడు అక్బరుద్దీన్ అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది.

అయితే అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తుండే సరికి ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాగా అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన్ను లండన్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన సోదరుడు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news