“ఆదిపురుష్” మేకర్స్ పై అలహాబాద్ హై కోర్ట్ ఆగ్రహం…

-

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ కు అడుగడుగునా కష్టాలు తగులుతున్నాయి. ఆదిపురుష్ లో డైలాగులు తొలగించాలని కొందరు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు అలహాబాద్ హై కోర్ట్ విచారణను స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో డిస్ క్లైమర్ ను అటాచ్ చేశామని మేకర్స్ తరపున లాయర్లు కోర్ట్ కు చెప్పుకున్నారు. హై కోర్ట్ వీరి సమాధానానికి మండిపడింది, మీరు ఏమనుకుంటున్నారు దేశ ప్రజలను బుద్ది హీనులు అనుకుంటున్నారా అంటూ ఎడాపెడా ప్రశ్నల వర్షం కురిపించింది. మీరు రాముడు, లక్ష్మణుడు, హనుమాన్ లంక అంటూ సృష్టించి ఫైనల్ గా ఇప్పుడు అది రామాయణం కాదంటారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై తర్వాత విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమాను ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో తెలియదు.. కానీ ఇన్ని కష్టాలను ఎదుర్కొంటోంది.

ఒక పౌరాణికాన్ని చిత్రీకరించే సమయంలో హిందువులకు సంబంధించిన అన్ని విషయాలను ఆలోచించుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news