కివీస్ ను చిత్తు చేసిన శ్రీలంక మహిళల జట్టు…

-

ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు ఆడడానికి వచ్చింది. అందులో భాగంగా ఈ రోజు గాలే వేదికగా జరిగిన మొదటి వన్ డే లో వర్షం పడడంతో ఆటను 28 ఓవర్ లకు మాత్రమే కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్లు కోల్పోయి 175 పరుగులకు పరిమితం అయింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో శ్రీలంక మహిళలు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. మొదటి ఓవర్ నుండి శ్రీలంక మహిళల టీం కెప్టెన్ చమరి ఆటపట్టు కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసింది. చివరి వరకు నిలబడి సెంచరీ చేసి జట్టుకు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించింది.

ఆటపట్టు తన ఇన్నింగ్స్ లో 83 బంతుల్లో 111 పరుగులు చేసి టీం ను విజయపధంలో నడిపించింది. ఆటపట్టుకు గుణరత్నే (50) నుండి చక్కని సహకార లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news