గద్వాల్ జిల్లా ఆలంపూర్ టికెట్ పై BRS డబుల్ గేమ్ ?

-

తెలంగాణాలో సరిగ్గా మరో నెల 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి, అందుకోసం పార్టీలు అన్నీ సీట్లు సర్దుబాటు మరియు కాండిడేట్ల ఎంపికలో చాలా బిజీగా ఉన్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక సీటు విషయంలో అధికార BRS పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు సూచనలు అందుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అబ్రహం BRS నుండి విజయం సాధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఈ మధ్యన కేసీఆర్ సైతం ఆలంపూర్ టికెట్ అబ్రహం కె ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు మూలంగా ఇప్పుడు ఆలంపూర్ టికెట్ విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందట. ఈ టికెట్ ను అబ్రహం కు కాకుండా మరొకరికి కేటాయించడానికి చూస్తున్నట్లు ప్రణాళికలు జరుగుతున్నాయి.

ఇందుకు సాక్ష్యమే తాజాగా అబ్రహం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చిన అబ్రహం ను కలవకుండా మంత్రి కేటీఆర్ వెళ్లిపోయారట. మరి ఇంకా ఈ సీట్ విషయంలో నిర్ణాయాన్ని ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ కలుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version