తిరుమల భక్తులకు అలర్ట్….రేపటి నుంచి జనవరి దర్శన టికెట్లు !

-

తిరుమల భక్తులకు అలర్ట్….రేపటి నుంచి జనవరి దర్శన టికెట్లు చేయనున్నారు. రేపటి నుంచి 24వ తేది వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. అలాగే.. తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్‌ అయింది. తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో భక్తులకు అనుమతి పున:రుద్దరణ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్‌ అయింది. నిన్న ఒక్క రోజు మాత్రం తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేశారు.

Special festivals to be held in Tirumala in 2025

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్‌ అయింది. కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ తరునంలో తిరుమలలోని 26 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 58637 మంది భక్తులు…నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 21956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version