కెసిఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటుంది – పువ్వాడ అజయ్

-

నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి పువ్వాడ అజయ్ కి వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు.

అనంతరం పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఆయన నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని, సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్.

Read more RELATED
Recommended to you

Latest news