అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ప్రీ టీజర్ రిలీజ్!

-

అల్లరి నరేష్ కథానాయకుడిగా హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ప్రీ టీజర్ రిలీజ్ అయింది. నరేష్ సరసన ఈ సినిమాలో కథానాయికగా ఆనంది అలరించనుంది. ఈ చిత్రానికి రాజ్ మోహన్ దర్శకత్వం వహించగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. మారేడుమిల్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. విభిన్నమైన కథాకథనాలతో.. సహజత్వానికి దగ్గరగా ఈ కథ నడుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

మారేడుమిల్లి అడవి ప్రాంతంలో 55 రోజుల పాటు షూటింగ్ చేశామని.. 250 మంది ఈ సినిమా కోసం అడవుల్లో పనిచేశారని చెప్పారు. ఈ సినిమాకోసం మారేడుమిల్లి లో ఇంత వరకు ఎవరూ షూట్ చేయని 22 లొకేషన్స్ లో షూటింగ్ చేశామని అన్నారు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో టీం తీసుకున్న రిస్క్ కి సంబంధించిన విజువల్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. కాగా పూర్తి టీజర్ ను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news