మంత్రులకు శాఖలు కేటాయింపు..రామ్మోహన్ నాయుడికి ఏ శాఖ కేటాయించారంటే..?

-

కేంద్రమంత్రి పదవులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీకి ఇదే శాఖ కేటాయించారు. అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు.

కాగా, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.శ్రీకాకుళం నుంచి మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news