జనసైనికులుగా అల్లు అర్జున్, వరుణ్ తేజ్.. ప్రచారానికి సిద్ధం..!

-

పవన్ కళ్యాణ్ జనసేన తరపున పార్టీ ప్రచారంలో ఏ ఒక్క మెగా హీరో ఇంతవరకు పాల్గొనలేదు. మెగాస్టార్ చిరంజీవి వద్దని చెప్పబట్టే జనసేన తరపున ఏ ఒక్క మెగా హీరో ప్రచారం చేయట్లేదని అన్నారు. ఎంతైన సినిమా వాళ్లు కదా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రావాలని ప్రచార ముగింపు సమయాల్లో హుశారెత్తించడానికి సిద్ధమయ్యారు మెగా హీరోలు. పవన్, నాగబాబులకు మాత్రమే కాదు జనసేనకు సపోర్ట్ గా మెగా హీరోలైన అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటారట.

ఇప్పటికే నాగబాబు కోసం నిహారిక ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటుంది. లేటెస్ట్ గా బన్ని, వరుణ్ ఇద్దరు జనసేన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ విషయాన్ని నాగబాబు సతీమణి పద్మజ వెళ్లడించారు. వరుణ్ అమెరికానుండి వచ్చి రాగానే పార్టీ ప్రచారంలో బిజీ అవుతాడని. వరుణ్ తేజ్ తో పాటుగా అల్లు అర్జున్ కూడా జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటారని ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో ఉండగా.. సాయి తేజ్ చిత్రలహరి బిజీలో ఉన్నాడు. అందుకే బన్ని, వరుణ్ లను ప్రచారానికి వాడేస్తున్నారు. మరి మెగా క్యాంపెయిన్ వల్ల జనసేనకు ఏమాత్రం లాభం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news