సాహోలో ప్రభాస్ వాడే బైక్ ధర ఎంతో తెలుసా.. షాక్ అవడం ఖాయం..!

-

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుజిత్ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సాహో సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచగా సినిమాలో ప్రభాస్ వాడే బైక్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో ప్రభాస్ వాడే బైక్ ట్రిమ్ప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్’ అనే బైక్ వాడారట. 765 సీసీ కెపాసిటీతో త్రీ సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవన్ సప్లై వస్తుందట. ఈ బైక్ టాప్ ధర 10.55 లక్షలు అని తెలుస్తుంది. ఇలాంటి మోడల్ బైక్ ఆల్రెడీ బాలీవుడ్ సినిమాల్లో వాడగా తెలుగు సినిమాల్లో వాడటం ఇదే మొదటిసారి. సాహోలో అబుదాబిలో వచ్చే యాక్షన్ సీన్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో కంపోజ్ చేయించారు. ఆ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news