అల్లు అరవింద్ ప్రెస్ మీట్ టార్గెట్ దిల్ రాజు గారేనా..!!

-

దిల్ రాజు ఈ మధ్య ఏది పట్టుకున్నా కూడా వివాదం లేకుండా నార్మల్ గా పూర్తి కావడం లేదు.గతంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా విషయంలో జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదు. ఏమాంటూ ఈ సినిమా మొదలు పెట్టారో గాని దిల్ రాజు చేతలు మాటలు అన్నీ వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

దీనిపై దిల్ రాజు పై బోలెడంత నెగిటివ్ ప్రచారం నడిచింది. ఇక వారీసు సినిమా ప్రమోషన్ ఈవెంట్ లోవిజయ్  అందరికంటే పెద్ద స్టార్. తమిళంలోి ఆయనకు పెద్ద మార్కెట్ వుంది. అన్న వ్యాఖ్యలు  ఫ్యాన్స్ మధ్య విపరీతంగా గొడవలు జరిగే తమిళనాడు లో ఇది అగ్నికి ఆజ్యం పోసింది.తర్వాత  మైత్రి మూవీస్ వారిని దెబ్బ కొట్టడం కోసమే తాజాగా దిల్ రాజు ఏషియన్ తో పాటు  కొంత మందిని కలుపుకుని ఓ సిండికేట్ గా మార్చి కొత్త పంపిణీ ఆఫీస్ ని ప్రారంభించాలనే ఆలోచన కూడా చేశారు.

ఇక లేటెస్టుగా గా దిల్ రాజు అల్లు అరవింద్ తో కయ్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పరశు రామ్ కు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ తనకు కాకుండా దిల్ రాజు కు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. దాని మీద ప్రెస్ మీట్ కు కూడా సిద్దం అయినట్లు తెలిసింది.కానీ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. పరశురామ్ తన బ్యానర్ లో సినిమా చేయాల్సింది పోయి దిల్ రాజుతో చేస్తున్నారని అల్లు అరవింద్ ఆగ్రహంతో ఉన్నారని పరిశ్రమ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news