జనసేనలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు

-

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆమంచి స్వాములు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్… ఆమంచి స్వాములుకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఆమంచి స్వాములు ఇవాళ బాపట్ల జిల్లా పందిళ్లపల్లి నుంచి భారీ అనుచరవర్గంతో మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చారు. చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ రెండు పర్యాయాలు గెలవడంలో ఆయన అన్న ఆమంచి స్వాములు పాత్ర కీలకం. అయితే ఇప్పుడు ఆమంచి కుటుంబంలో తమ్ముడు వైసీపీలో ఉండగా, అన్న జనసేన పక్షాన చేరారు.

ఈ సందర్భంగా ఆమంచి స్వాములు మాట్లాడుతూ.. బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండే పార్టీ జనసేన అని కొనియాడారు. ఈ రోజు అలాంటి పార్టీలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని, తామంతా ఆయన వెనుక నడుస్తామని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version