మాది ‘కోడికత్తి పార్టీ’ కాదు…అంబటి

-

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన నాటి నుంచి వైసీపీ ని కోడి కత్తి పార్టీ అంటూ అభివర్ణించడాన్ని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. తెదేపా నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతూ…తెదేపా నేతకు ప్రజాస్వామ్యం ఇన్నాళ్లు గుర్తుకు రాలేదా? తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తెదేపా లోకి ఆహ్వానించినప్పుడు ప్రజాస్వామ్యం, రాష్ట్ర భవిష్యత్ గుర్తుకు రాలేదా? నాలుగున్నరేళ్లు భాజపాతో కలిసి ప్రయాణం చేసినప్పుడు జాతి ప్రయోజనాలు ఏమయ్యాయి అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

నీతి బాహ్యమైన పొత్తులను పెట్టుకుంటూ రాజకీయ సాంప్రదాయాలను తుంగలో తొక్కిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారంటూ పేర్కొన్నారు. ఓటమి భయంతో తెదేపా అనేక మార్గాలను చూసుకుంటుందని అందులో భాగంగానే కాంగ్రెస్ తో పొత్తు అంటూ అంబటి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news