Breaking : చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

-

నన్ను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే.. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. తనను గంట, అరగంట మంత్రి అన్నందుకు మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నన్ను గంట, అరగంట మంత్రి అంటున్నాడు. సంస్కారం ఉందా?? అని ఆయన మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ నేతగా సంజయ్ గాంధీ దగ్గర చంద్రబాబు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడో నా దగ్గర చిట్టా ఉంది. అంజయ్య క్యాబినెట్ లో ఉన్నప్పుడు వైఎస్సార్ బ్యాగులు, సూట్ కేసులు మోసావ్. నీ పెళ్ళి సంగతి తెలుసు. నీ కుటుంబం గురించి తెలుసు.

మీ రామ్మూర్తి నాయుడు గురించి, నీ భార్య గురించి, కొడుకు గురించి తెలుసు. ఒక్క నిమిషం సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్ చంద్రబాబు. నేను నీ కుటుంబం గురించి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్. నోరు అదుపులో పెట్టుకో. నోరు జారితే ఉరేసుకుని చచ్చే విషయాలు బయట పెడతాను.జగన్ నవ్వుతున్నా చూసి ఏడ్చే ఖర్మ చంద్రబాబుది. ఊరకనే నోరు పారేసు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావటం అసంభవం. మేము చంద్రబాబు, లోకేష్ ను చంపేస్తామా?? రాజకీయంగా ఏమున్నారని చంపటానికి??’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version