అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు: ప్రత్తిపాటి పుల్లారావు

-

కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలపై వైసీపీ దౌర్జన్యం చేస్తోందంటూ మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించిన త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ దుర్మార్గాన్ని ప్రశ్నించిన 11 మంది డైరెక్టర్లను కిడ్నాప్ చేయడం దారుణం అన్నారు పుల్లారావు.

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యమన్నా, ప్రజల అభిప్రాయమన్నా జగన్ కు గౌరవం లేదన్నారు. ఎన్నికల వ్యవస్థనే జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని.. తిరుపతి ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమాలను ఆధారాలతో బయట పెట్టినా చర్యల్లేవని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కొవ్వూరు బ్యాంకు ఎన్నికలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికలను కూడా హైజాక్ చేసి నియంతలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version