శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్‌షా

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కాసేపటి క్రితమే శ్రీశైలం చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భ్రమరాంబ సమేత మల్లిఖార్చున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఇక అంతకు ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కు ఆంధ్ర ప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. ఆలయ అధికారులు.. ఇతరు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

అనతరం స్వామి, అమ్మవార్లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు. ఇక మొదట హైదరాబాద్‌ లోని బేగంపేట విమానశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ లో శ్రీశైలం చేరుకున్నారు అమిత్‌ షా. అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అమిత్‌ షా… భార్యకు శ్రీశైలం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయించినట్లు సమాచారం అందుతోంది. గతేడాది కూడా అమిత్‌ షా తన భార్య తో కలిసి శ్రీశైలం వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news