జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా అమ్రపాలి

-

ఐఏఎస్ ల బదిలీల్లో స్వల్ప మార్పులు

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా అమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం  బుధవారం సాయంత్రం ఉత్తర్వూలు జారీచేసింది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం వెలువడ్డ ఉత్తర్వూల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల కలెక్టర్ గా బదిలీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news