బీహార్ సీఎంకు నిరసన సెగ.. నితీశ్​పైకి కుర్చీ విసిరిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి

-

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నితీశ్​కు గట్టి షాక్ అచ్చారు. ఔరంగాబాద్ ప‌ట్ట‌ణంలో నితీశ్ చేప‌ట్టిన స‌మాధాన్ యాత్రకు భారీ సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లివ‌చ్చారు. ఈ యాత్ర‌లో భాగంగా బ‌రూన్ బ్లాక్‌లో పంచాయ‌తీ భ‌వ‌నాన్ని ప్రారంభించేందుకు నితీశ్ వెళ్తున్నారు. అంత‌లోనే జ‌నాల మ‌ధ్య‌లో నుంచి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నితీశ్​వైపునకు దూసుకొచ్చాడు.

అతడి చేతిలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీని సీఎం నితీశ్‌పైకి విసిరేశాడు. అయితే ఆ కుర్చీ నితీశ్​కు కాస్త దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నితీశ్​ను సేఫ్​గా ఉండే ప్రాంతానికి తరలించారు. నితీశ్​కు చేతులు అడ్డుపెట్టి ముందుకు సాగారు. కుర్చీ విసిరిన వ్యక్తి వెంటనే అక్కణ్నుంచి పరారయ్యాడు. అతడి కోసం కాసేపు పోలీసులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేడీ పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version