వివేకా బతికున్నా, అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చేవాళ్లు – కొడాలి నాని

-

వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ వివేకా బతికున్నా, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే వారంటూ వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై కోడాలి నాని సోమవారం స్పందించారు. 2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చంద్రబాబు మరోసారి చూస్తారంటూ పేర్కొన్నారు.

మార్చి 18వ తేదీ నుంచి జగనన్నే భవిష్యత్తు కార్యక్రమం అంటూ తెలిపారు. లోకేష్ కి తాత గొంతు రావడం ఏంటి? లోకేష్ కు వచ్చింది చంద్రబాబు గొంతు అయి ఉంటుందంటూ విమర్శించారు. ఎన్టీఆర్ బతికుంటే లోకేష్ మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండే వారంటూ ఎద్దేవా చేశారు. జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అంటూ టిడిపికి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ఉందని ఐ-టీడీపీ పెట్టారని, అవసరమైతే తడిగుడ్డతో గొంతులు కోయడం ఎలా అని రాయ మనండి అంటూ కోడలి నాని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version