థ్యాంక్యూ బ్రదర్ అంటున్న అనసూయ..

-

యాంకర్ గా బిజీగా ఉంటున్న అనసూయ సినిమాలపై ఫోకస్ బాగానే పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటికి మించి సినిమాలున్నాయి. తాజాగా మరో చిత్ర ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్యాంక్యూ బ్రదర్ అనే పేరుతో రూపొందిన ఈ సినిమాని నూతన దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. అనసూయతో పాటు అశ్విన్ విరాజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.

చిత్ర మోషన్ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉంది. తలుపులు మూసిన లిఫ్ట్ ముందు మాస్క్ పడి ఉండడం చూస్తుంటే ఇప్పటి పరిస్థితికి తగిన విధంగా సినిమా కథ ఉందని అర్థం అవుతుంది. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news