Andhra Pradesh : మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు….

-

రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నట్లు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం కృష్ణం రాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్ తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలని శ్యామలాదేవి సూచించారు.

 

 

ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ – కృష్ణంరాజు జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో నిర్వహిస్తున్నము.పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, బాబు ప్రభాస్,ప్రసీద ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు 1000 మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం అని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news